ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...
Showing posts with label ఇస్మాయిల్ పురస్కారం. Show all posts
Showing posts with label ఇస్మాయిల్ పురస్కారం. Show all posts

Tuesday, November 6, 2012

4 నవంబరు 12 న కాకినాడలో, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ కవితా పురస్కార సభ ఆత్మీయ వాతావరణం లో జరిగింది. ఇస్మాయిల్‌గారి గురించి ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు, ఆకాశం సంపుటి గురించి మృణాళినిగారు, సభలో ఆవిష్కరించిన శ్రీకాంత శర్మగారి సంపుటి 'ఏకాంత కోకిల ' గురించి వీరలక్ష్మి గారు, డాక్టర్ సుధాకర్ గారి అనువాద సంపుటి 'కుంకుమ రజను ' గురించి కొప్పర్తిగారు, తరువాత 'ఆకాశం ' కవి ప్రసాద్ మాట్లాడారు. సుమారు, మూడుగంటలపాటు సభ ఆసక్తికరంగా నడిచింది. 'మన కవులలో, శ్రీశ్రీ తరువాత రెండవతరంలో, మూడుపేర్లు చెప్పవలసివస్తే నేను ఖచ్చితంగా బివివి ప్రసాద్ పేరు చెబుతాను ' అన్నారు శ్రీకాంతశర్మగారు. మన కవిత్వమంతటా అలముకొన్న ఫిర్యాదు కవిత్వానికి వ్యతిరేకంగా, జీవితాన్ని ప్రేమించే కవిత్వమని ఆకాశం గురించి మృణాళినిగారు వివరించారు.


"ఆకాశం" రచయిత శ్రీ.బి.వి.వి.ప్రసాద్ గారికి ఇస్మాయిల్ అవార్డు-2012 బహుకరణ.

Friday, November 2, 2012

ఇస్మాయిల్ పురస్కారం 2012


ప్రియమైన మిత్రులకు,
కొద్ది మంది మిత్రులతో ఏర్పడిన ‘ఇస్మాయిల్ మిత్ర మండలి’ గత మూడు సంత్సరాలుగా తెలుగులో వస్తున్న ఒక మంచి కవితా సంకలనానికి ‘ఇస్మాయిల్ కవితా పురస్కారాన్ని’ అందిస్తోంది.  2011 సంవత్సరానికి ‘బి.వి.వి.ప్రసాద్’ వ్రాసిన ‘ఆకాశం’ పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. ది. 04.11.12 న సాయంతం 04.30 గంటలకు రోటరీ హాలు, కల్పన సెంటర్, కాకినాడలో ఈ పురస్కార సభ జరుగుతుంది.

అందరికీ ఆహ్వానం
అభినందనలతో,
మిత్రమండలి


Sunday, November 27, 2011

ఇస్మాయిల్ కవితా పురస్కారం, 2010 పొందిన కవితా సంకలనం "రెండో పాత్ర" . కవి : విన్నకోట రవి శంకర్

ఇస్మాయిల్ కవితా పురస్కారం
శ్రీ విన్నకోట రవి శంకర్ రచించిన ‘రెండో పాత్ర’ కవితా సంపుటికి ఇస్మాయిల్ కవితా పురస్కారం ప్రదానం చేసారు. ఆదివారం ఉదయం స్థానికి పి.ఆర్. కాలేజి ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించిన సభలో పలువురు వక్తలు పాల్గొని ఇస్మాయిల్ గారి గురించి ‘మళ్లీ మాట్లాడుకుందాం’ అంటూ నిర్వహించిన సభ కవిత్వ పరిమళంతో గుభాళించింది.
‘రెండో పాత్ర’ కవితా విశిష్టతను వివరిస్తూ శ్రీ రెంటాల ఉపన్యసించారు. కవిత్వంలో నిశ్శబ్దం పోషించే పాత్ర, పదాల పొందిక, పొదుపుగా వాడుకొనే పనితనం కవి రవిశంకర్ సొంతమని సోదాహరణంగా వివరించారు. రెండో పాత్ర సంపుటి లోంచి ఆయన చదివి వినిపించి అలరింప చేసారు.
‘ఇస్మాయిల్ కి ఇష్టమైన కవి టాగోర్’ అన్న అంశం మీద ప్రముఖ కవి అవధాని శ్రీ డా. రాళ్లబండి కవితా ప్రసాద్ ఉపన్యాసం చాలా ఆహ్లాదంగా సాగింది. చలం అనువాదాల ద్వారా ఇస్మాయిల్ భావాలతో సమన్వయం పరచిన తీరు శ్రోతల్ని ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడి రచన ‘నేను తిరిగిన దారులు’ పుస్తకాన్ని డా. ఆలూరి విజయ లక్ష్మి గారు ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర పుస్తక పరిచయం చేస్తూ యాత్రా సాహిత్యంలో ఇదొక ప్రత్యేక రచనగా అభివర్నిచారు.
అనంతరం పురస్కార గ్రహీతకి అవార్డు ప్రధానం, సత్కారం జరిగాయి. ఇస్మాయిల్ గారి శిష్యుడైన తనకు ఆయన పేరుతో అవార్డు రావడం పట్టరాని సంతోషంగా ఉందన్నారు కవి రవిశంకర్.
విదేశాల్లో ఉద్యోగరీత్యా ఎంతో ‘బిజీ’ గా ఉన్నప్పటికీ కవిత్వ పురస్కారం సందర్భంగా ఇస్మాయిల్ గారి మీద ప్రేమతో, ఇస్మాయిల్ మిత్ర మండలి ఆహ్వానాన్ని మన్నించి వ్యయ ప్రయాసల కోర్చి ఈ సభకి వచ్చిన కవి రవిశంకర్ ని అంతా అభినందించారు. ఆద్యంతం సభని శ్రీ సి.యస్. ఆహ్లాదంగా నిర్వహించారు.
కార్యక్రమాన్ని శ్రీమతి ధూళిపాళ అన్నపూర్ణ గారు ప్రారంభించారు. ప్రారంభంలో కవి భగవంతం ఆలపించిన కీర్తన శ్రోతల్ని అలరించింది.
ప్రతియేట నిజమైన మంచి కవిత్వానికి గుర్తింపుగా ఇవ్వబడుతోన్న ఈ పురస్కార ప్రధాన కార్యక్రమం ఇలా ఆహ్లాదంగా ప్రతియేట కొనసాగిస్తామని మిత్రమండలి తరుపున శ్రీమతి డా. వాడ్రేవు వీర లక్ష్మీ దేవి తెలియజేస్తూ ‘ఆంధ్రా పేపర్ మిల్స్’ వారు మిత్ర మండలికి రూ. 15000/- విరాళం అందించారని తెలియజేసారు.
వాడ్రేవు చిన వీరభద్రుడు, కుప్పిలి పద్మ, తల్లావఝుల పతంజలి శాస్త్రి, మధునాపంతుల చలపతి, దాట్ల దేవదానం రాజు, కొప్పర్తి, ఎం.ఎస్. సూర్యనారాయణ, అద్దేపల్లి ప్రభు, ఎం.ఎస్. నాయిడు, గోటేటి లలిత శేఖర్, రామ చంద్రా రెడ్డి, జగన్, రవి, నామడి శ్రీధర్, డా. ఎల్.కే.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

please click here to see all photos of the event :